పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘రాధే శ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మించగా , పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మార్చి 11 న ఈ మూవీని ఐదు భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది.
కానీ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడం తో రోజు రోజుకు కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. మొదటి రెండు రోజులుగా భారీగానే వసూళ్లు రాబట్టగా..మూడో రోజు నుండి కలెక్షన్లు తగ్గడం మొదలయ్యాయి. ఇక ఆరు రోజుల్లో రాధే శ్యామ్ ఎంత రాబట్టిందో చూస్తే..
నైజాంలో రూ. 26 లక్షలు
సీడెడ్లో రూ. 9 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు
ఈస్ట్లో రూ. 5 లక్షలు
వెస్ట్లో రూ. 4 లక్షలు
గుంటూరులో రూ. 5 లక్షలు
కృష్ణాలో రూ. 5 లక్షలు
నెల్లూరులో రూ. 3 లక్షలతో.. 6వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 63 లక్షలు షేర్తో పాటు రూ. 1.05 కోట్లు గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 78.40 కోట్లు షేర్తో పాటు రూ. 140.50 కోట్లు గ్రాస్ను వసూలు చేసింది.