తమిళ నటుడు రాధా రవి దర్శకుడు శంకర్ని టార్గెట్ చేశారు. ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. కమల్హాసన్ నటిస్తున్న భారీ చిత్రం `ఇండియన్ 2`. శంకర్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని లైకా అధినేత అల్లిరాజా సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతుండగా ప్రమాద వశాత్తు క్రేన్ విరిగిపడి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఉదంతంపై పలువురు విచారం వ్యక్తం చేస్తుంటే తమిళ నటుడు రాధా రవి మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ చిత్రాల్ని రూపొందించాలని చూసే దర్శకులు ఆ సినిమాకు పనిచేసే వారి సెఫ్టీని మాత్రం గాలికి వదిలేస్తున్నారని. ఇప్పటికైనా వారి వైఖరిలో మార్పులు రావాలని ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఘాటుగా విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల `ఇండియన్-2` షూటింగ్లో చంద్రన్, కృష్ణ, మధు చనిపోవడంతో వారి సంతాభ సభని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధా రవి దర్శకుడు శంకర్ని టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. ఇంకా ఎలాంటి విమర్శలు పడాల్సి వస్తుందోనని శంకర్ టీమ్ భయపడుతోందట. 1996లో వచ్చిన `భారతీయుడు` చిత్రానికి సీక్వెల్గా శంకర్ తాజా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం సద్దుమనిగి మళ్లీ షూటింగ్ ప్రారంభం కావడానికి సమయం పట్టేలా వుందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.