ఇటీవల బాలీవుడ్ హిట్ చిత్రం `బద్లా`ని తెలివిగా మార్చి `ఎవరు` అనే క్రైమ్ థ్రిల్లర్గా రీమేక్ చేశారు పీవీపీ. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి నిర్మాతకు లాభాల వర్షం కురిపించింది. ఈ ప్లాన్ వర్కవుట్ అయి లాభాలు తెచ్చిపెడుతుండటంతో తాజాగా పీవీపీ మరో సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొంత విరామం తరువాత మళ్లీ మరో హిట్ చిత్రాన్ని తెలుగులో పీవీపీ రీమేక్ చేయబోతున్నారు. తమిళంలో కొత్త తరహా కథతో రూపొందిన `ఓ మై కడవులే` చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇందులో `గురు` ఫేమ్ రితికా సింగ్, అశోక్ సెల్వన్ జంటగా నటించారు. ఇందులో దేవుడిగా అతిథి పాత్రలో తమిళ హీరో విజయ్సేతుపతి నటించి ఆకట్టుకున్నారు. దీంతో ఇదే క్రూని లీసుకుని తెలుగుకు మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ కోసం రితికా సింగ్ ప్లేస్లో ఓ క్రేజీ హీరోయిన్ని సంప్రదిస్తున్నారట.
ఇటీవలే మహేష్తో నిర్మించిన `మహర్షి` చిత్రానికి పీవీపీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడం. అదే సమయంలో సోలోగా నిర్మించిన `ఎవరు` భారీ లాభాల్ని తెచ్చిపెట్టడంతో చిన్ని చిత్నాల్ని కొత్త తరహా కథాంశాన్ని ఎంకరేజ్ చేయాలని పీవీపీ భావిస్తున్నారట. ఈ రీమేక్లో అశోక్ సెలకవన్ నటిస్తారా? లేక మళ్లీ అడివి శేష్నే లైన్లోకి తీసుకొస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.