సినీ ఇండస్ట్రీకి కరోనా భారీ షాకిచ్చింది. లాక్డౌన్ కారణంగా ఎవరూ ఇళ్లు వదిలి బయట అడుగుపెట్టలేని పరిస్థితి. దీంతో జనజీవితం పూర్తిగా స్థంభించిపోయింది. గత మూడు నెలలుగా థియేటర్లు బంద్, షూటింగ్లు బంద్. దీంతో రిలీజ్కి సిద్ధంగా వున్న సినిమాల నిర్మాతలంతా దిక్కుతోచక తలపట్టుకుంటున్నారు. కొంత మంది మాత్రం ఓటీటీల్లో రిలీజ్కి సిద్ధపడుతున్నారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్లు కూడా భారీ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేయలేక తమ సినిమాలని ఓటీటీ ప్లాట్ ఫామ్లకు ఇవ్వలేక కొంత మంది నిర్మాతలు సతమతమవుతున్నారు. `నిశ్వబ్దం` టీమ్ కూడా గత కొన్ని రోజులుగా ఇలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటోంది. అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినా వారికి సినిమాని ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తోంది.
ఈ సంకట స్థితిలో ఏం చేయాలో తెలియక పోవడంతో పూరి జగన్నాథ్ని చిత్ర బృందం ఆశ్రయించినట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొన్ని కరెక్షన్స్ చెప్పిన పూరి ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినప్పుడు ఇచ్చేయడమే మంచిదని, ఇప్పుడున్న సరిస్థితుల్లో అదే ఉత్తమమని పూరి సలహా ఇచ్చినట్టు తాజా టాక్. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మేకర్స్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.