ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ అధినేత వెంకట్రామి రెడ్డి ఈరోజు కన్నుమూశారు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి విజయా సంస్థ అధినేత నాగిరెడ్డి కుమారుడు . దక్షిణాదిన అజరామరమైన చిత్రాలను అందించిన గొప్ప సంస్థ విజయా ప్రొడక్షన్స్ . నాగిరెడ్డి – చక్రపాణి ల భాగస్వామ్యంలో సంచలనాత్మక చిత్రాలు వచ్చాయి . అయితే మధ్యలో చాలాకాలం పాటు సినిమాలకు దూరమైంది ఆ సంస్థ .
అయితే మళ్ళీ వెంకట్రామిరెడ్డి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ చిత్ర నిర్మాణాలు చేసాడు . బాలకృష్ణ తో భైరవద్వీపం , రాజేంద్ర ప్రసాద్ తో బృందావనం చిత్రాలను తెలుగులో నిర్మించాడు . అయితే తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువ సౌలభ్యం ఉందనుకున్నాడో ఏమో ! ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ లోనే చిత్రాలను నిర్మించాడు . వెంకట్రామి రెడ్డి కి ఒక భార్య కొడుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు . వెంకట్రామిరెడ్డి మృతి పట్ల టాలీవుడ్ ,కోలీవుడ్ కూడా తీవ్ర సంతాపాన్ని తెలిపింది . ఇక వెంకట్రామిరెడ్డి అంత్యక్రియలు రేపు చెన్నై లో జరుగనున్నాయి.