Homeటాప్ స్టోరీస్పంతం పట్టి మరీ చెబుతున్నాడు రిలీజ్ డేట్

పంతం పట్టి మరీ చెబుతున్నాడు రిలీజ్ డేట్

producer kk radha mohan responds on rumoursగోపీచంద్ హీరోగా నటించిన ” పంతం ” చిత్రం తప్పకుండా జూలై 5న విడుదల అవుతుందని ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆ చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ . విభిన్న కథా చిత్రాలను నిర్మించిన రాధామోహన్ తాజాగా గోపీచంద్ తో పంతం చిత్రాన్ని చక్రవర్తి అనే దర్శకుడి ని పరిచయం చేస్తూ నిర్మిస్తున్నాడు . గోపీచంద్ కు గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేకపోయినప్పటికీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు .

సమాజానికి సందేశాన్ని ఇచ్చే చిత్రమని , బర్ణింగ్ ప్రాబ్లెమ్ ని ఇతివృత్తంగా చేసుకొని ఈ పంతం ని రూపొందించామని …… సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు . అంతేకాదు మా పంతం సినిమా సరైన సమయంలో విడుదల కాదని కొంతమంది అవాకులు చవాకులు పేల్చుతున్నారని ఎట్టి పరిస్థితుల్లో జూలై 5న విడుదల చేస్తున్నానని కసితో చెబుతున్నాడు రాధామోహన్ . ఈనెల 21న ఆడియో వేడుకని విజయవాడ లో , 24న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించి జూలై 5న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని పంతం పట్టి మరీ షెడ్యూల్ చెబుతున్నాడు రాధామోహన్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All