లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్లు త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీని కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలని విడుదల చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తరహాలోనే కరోనా నిబంధనలని పాటిస్తూనే ఎలా షూటింగ్ చేయాలో ఓ జీఓని విడుదల చేశారు. దీనిపై బుధవారం ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాత సి. కల్యాణ్ స్పందించారు.
ఇటీవల మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాలు సినిమా షూటింగ్ల పునః ప్రారంభం కోసం జీవోలని విడుదల చేశాయి. ఆ జీవోలతో షూటింగ్లు చేయలేం. అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వుండబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్గారు ఎంతో ముందు చూపుతో, ఓ విజన్తో నెంబర్ ఆఫ్ రూల్స్ కారణంగా సినిమా వాళ్లు ఇబ్బందులు పడతారని చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రి చాలా చొరవని చూపించారు.
మీరూ ఇబ్బంది పడకుండా, మమ్మల్ని, పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా షూటింగ్లు చేసుకకోండని త్వరలోనే జీవోని విడుదల చేయబోతున్నారు. ఈ రోజు లేదా రేపు ఈ జీవో రాబోతోంది` అని వెల్లడించారు. ఈ సందర్భంగా సినీ జర్నలిస్టులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ట్రస్ట్ తరుపున ఆయన తనయుడు తలసాని సాయికిరణ్ నిత్యావసర సరుకుల్ని అందజేశారు.