బాహుబలి సిరీస్ ల తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ” సాహో ”. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హిందీ , తెలుగు , తమిళ్ , మలయాళ బాషలలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే . అయితే సాహో ప్రారంభం అయింది కానీ మేజర్ పార్ట్ షూటింగ్ అలాగే ఉండిపోయింది , అలాగే కీలక సన్నివేశాలను దుబాయ్ లో చిత్రీకరించాలని భావించారు కానీ అక్కడ షూటింగ్ చేసుకోవడానికి అబుదాబి అధికారులు అనుమతి ఇవ్వలేదు దాంతో ప్రభాస్ సినిమాకు అడ్డంకులు వచ్చాయి .
కట్ చేస్తే ఇన్ని రోజుల తర్వాత ప్రభాస్ సినిమా షూటింగ్ కి అనుమతులు ఇచ్చారు అబుదాబి అధికారులు ,దాంతో ప్రభాస్ సాహో కు అడ్డంకులు తొలిగాయ్ . ప్రస్తుతం అబుదాబి లో సాహో షూటింగ్ జరుపుకుంటోంది . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుండగా మందిరా బేడీ వ్యాంప్ క్యారెక్టర్ పోషిస్తోంది . యువి క్రియేషన్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయ్ మరి .