ఒకరొతో మొదలైన సినిమాలు మరొకరితో ఎండవడం అన్నది సినిమాల్లో కామనే. తాజాగా ఓ నటి చేయాలనుకున్న సినిమా మరో నటికి దక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. `మహానటి` చిత్రంతో అద్వితీయమైన అభియనయాన్ని ప్రదర్శించిన కీర్తిసురేష్కు ఆ తరువాత వరుస ఆఫర్లు పలకరించిన విషయం తెలిసిందే. అందులో అజయ్ దేవగన్ కీలక పాత్రలో తెరపైకి వస్తున్న`మైదాన్` ఒకటి.
ఫుట్బాల్ గేమ్ నేపథ్యంలో్ ఫుల్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని అమిత్రవీంద్రనాథ్ శర్మ రూపొందిస్తున్నారు. జీ స్టూడియోస్తో కలిసి బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం కీర్తిసురేష్ని తీసుకున్నారు. ఇందు కోసం బరువు తగ్గాలని చెప్పడంతో కీర్తి కఠోరంగా శ్రమించి గుర్తు పట్టలేనంతగా బరువు తగ్గింది.
అయితే ఆ తరువాత ఇద్దరు పిల్లకి తల్లిగా కనిపించాలి, చాలా యంగ్గా కనిపిస్తున్నావని మేకర్స్ కండీషన్స్ పెట్టడంతోమైదాన్` చిత్రం నుంచి కీర్తిసురేష్ తప్పుకుంది. ఆ స్థానంలో ప్రియమణిని చిత్ర బృందం ఫైనల్ చేసుకుంది. తాజాగా ఈ విషయాన్నిచిత్ర బృందం వెల్లడించడంతో కీర్తిసురేష్ ఫ్యాన్స్ ఫాక్కి గురవుతున్నారు. `మైదాన్` చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని కీర్తిసురేష్ మెస్మరైజ్ చేస్తుందని అంతా భావించారు కానీ సీన్ రివర్స్ అయిపోయింది.