ప్రకాష్రాజ్ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం `మన ఊరి రామాయణం`. ఈ చిత్రంలో వేశ్య పాత్రలో మెరిసింది ప్రియమణి. విలక్షణ పాత్రల్ని ఎంచుకుంటూ సరికొత్త ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తెలుగులో సినిమా చేసి దాదాపు రెండేళ్లవుతోంది. ఎంత గ్యాప్ వచ్చినా మెరుపు లాంటి పాత్రలతో బ్యాక్ టు బ్యాక్ తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు ఇద్ధమవుతోంది. నేడు ఆమె పుట్టిన రోజు.
ప్రియమణి తెలుగులో రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి రానా హీరోగా నటిస్తున్న `విరాటపర్వం`. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్కగా ప్రియమని ఓ ఛాలెంజింగ్ రోల్లో కనిపించబోతోంది. ఈ రోజు ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు కూడా.
దీనితో పాటు ప్రియమణి మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం `నారప్ప`. తమిళ హిట్ చిత్రం `అసురన్` ఆధారంగా నిర్మిస్తున్న కలైపులి ఎస్. ధానుతో కలిసి డి. సురేష్బాబు నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్కు జోడీగా ప్రియమణి నటిస్తోంది. ఇందులో టిపికల్ విలేజ్ వైఫ్గా ప్రియమణ పాత్ర చాలా కొత్తగా వుండబోతోంది. ఈ పాత్రకు సంబంధించిన లుక్ని కూడా ఈ రోజే రిలీజ్ చేశారు. పక్కా గ్రామీణ యువతిగా ఎడ్ల బండిపై కూర్చుని ప్రియమణి కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇలా ఒకే సారి రెండు విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులని సర్ప్రైజ్ చేయడానికి రెడీ అవుతోంది ప్రియమణి.