Homeటాప్ స్టోరీస్రోజా ని లైట్ గా తీసుకున్న ప్రియా రామన్

రోజా ని లైట్ గా తీసుకున్న ప్రియా రామన్

Priya raman
Priya raman

రోజా నాకు మంచి స్నేహితురాలు కాబట్టి ఆమెతో నాకు పెద్దగా ఛాలెంజ్ లేదంటూ రోజా ని లైట్ గా తీసుకుంది బీజేపీ లో చేరిన సినీ నటి ప్రియరామన్ . పేరుకి ఈ భామ మలయాళీ కానీ ఉంటున్నది తమిళనాడు కానీ రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది . నిన్న తిరుపతి లో భారతీయ జనతా పార్టీలో చేరింది ప్రియరామన్ .

ఆ సందర్బంగా మీడియా తో మాట్లాడిన ప్రియరామన్ రోజా నాకు పోటీ అని భావించడం లేదని , నేను ఏ రకంగా పార్టీకి ఉపయోగపడతానో పార్టీ వాళ్ళు నిర్ణయిస్తారని , ఇకపై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని అంటోంది ప్రియరామన్ . ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలా గౌరవమని , అయన వల్లే మన దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నానని అందుకే బీజేపీ లో చేరానని అంటోంది . తిరుపతి కేంద్రంగా రాజకీయం చేయడానికి వచ్చింది ఈ భామ అయితే అదే జిల్లా నుండి రోజా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All