రోజా నాకు మంచి స్నేహితురాలు కాబట్టి ఆమెతో నాకు పెద్దగా ఛాలెంజ్ లేదంటూ రోజా ని లైట్ గా తీసుకుంది బీజేపీ లో చేరిన సినీ నటి ప్రియరామన్ . పేరుకి ఈ భామ మలయాళీ కానీ ఉంటున్నది తమిళనాడు కానీ రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది . నిన్న తిరుపతి లో భారతీయ జనతా పార్టీలో చేరింది ప్రియరామన్ .
ఆ సందర్బంగా మీడియా తో మాట్లాడిన ప్రియరామన్ రోజా నాకు పోటీ అని భావించడం లేదని , నేను ఏ రకంగా పార్టీకి ఉపయోగపడతానో పార్టీ వాళ్ళు నిర్ణయిస్తారని , ఇకపై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని అంటోంది ప్రియరామన్ . ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలా గౌరవమని , అయన వల్లే మన దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నానని అందుకే బీజేపీ లో చేరానని అంటోంది . తిరుపతి కేంద్రంగా రాజకీయం చేయడానికి వచ్చింది ఈ భామ అయితే అదే జిల్లా నుండి రోజా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే .