మలయాళ స్టార్ హీరో, సక్సెస్ఫుల్ డైరెక్టర్ పృధ్వీరాజ్ సుకుమారన్ తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అతనికి నెగెటివ్ రావడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా ప్రపంచ దేశాల్లో ప్రబలుతున్న నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయని పృథ్వీరాజ్ సుకుమారన్ 58 మంది టీమ్తో జోర్డాన్ వెల్లిన విషయం తెలిసిందే.
అక్కడ `ఆడుజీవితం` సినిమా కోసం పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలని కోరడంతో అవి పాటిస్తూనే పృథ్వీరాజ్ తన సినిమా షూటింగ్ని పూర్తి చేశాడు. అయితే ఇండియా తిరిగి రావడానికి అంతర్జాతీయ విమాన సర్వీసుల బంద్ కావడంతో తన టీమ్తో జోర్డాన్లోనే రెండు నెలల పాటు వుండిపోవాల్సి వచ్చింది.
ఇటీవల విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇండియా తిరిగి వచ్చాడు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నిబంధనల ప్రకారం కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి కావడంతో పరీక్షలు చేయించుకున్నాడు. టెస్టుల అనంతరం అతనికి నెగెటివ్ రావడంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదిగా వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.