మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు ఒక సూపర్ హిట్ చాలా అవసరం. వరసగా ఆరు ప్లాపుల తర్వాత సాయి తేజ్ ఈ ఏడాది చిత్రలహరితో ఓ మాదిరి హిట్ ను అందుకున్నాడు. అయితే మళ్ళీ తన మార్కెట్ ట్రాక్ లో పడాలంటే ఒక సూపర్ హిట్ అవసరం. అందుకే ప్రతిరోజూ పండగే చిత్రంపై తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. అయితే ఈ చిత్రం ఆశించిన రేంజ్ లో లేదనే టాక్ వచ్చింది. కచ్చితంగా సూపర్ గా ఉంటుంది అనే అంచనాలను క్రియేట్ చేసినా కానీ ఆ రేంజ్ లో సినిమా లేకపోవడంతో యావరేజ్ రివ్యూలే వచ్చాయి. ప్రేక్షకుల నుండి కూడా అదే స్థాయి రెస్పాన్స్ వచ్చింది. అయితే పోటీగా ఉన్న సినిమాల కంటే ఇదే బెటర్ కావడంతో ప్రేక్షకుల ఓటు ఈ చిత్రానికే పడింది.
తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ తో ప్రతిరోజూ పండగే అకౌంట్ ఓపెన్ చేయగా, ఆదివారం వసూళ్లు తొలిరోజు స్థాయిలోనే ఉండడంతో ఈ చిత్రం హిట్ ట్రాక్ వైపు పయనిస్తోందని అంటున్నారు ట్రేడ్ పండితులు. 18 కోట్లకు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసిన ఈ చిత్రం తొలి మూడు రోజుల వసూళ్లు చూసుకునే సరికి 9 కోట్ల పైచిలుకు వసూళ్ల షేర్ సాధించింది. అంటే సగం షేర్ తిరిగి రాబట్టినట్టే. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను పరిగణనలోకి తీసుకుంటే వసూళ్లు 11 కోట్లను దాటాయి. సంక్రాంతి వరకూ పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయం అంటున్నారు. ఒకసారి ఈ చిత్ర కలెక్షన్స్ ను చూసుకుంటే…
నైజాం : 3.84 కోట్లు
సీడెడ్ : 1.11 కోట్లు
గుంటూరు : 65.5 లక్షలు
ఉత్తరాంధ్ర : 1.35 కోట్లు
తూర్పు గోదావరి : 68 లక్షలు
పశ్చిమ గోదావరి : 52.5 లక్షలు
కృష్ణా : 62.5 లక్షలు
నెల్లూరు : 34 లక్షలు
ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ : 9.12 కోట్లు
కర్ణాటక + ఇండియా : 75 లక్షలు
ఓవర్సీస్ : 1.67 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్ : 11.54 కోట్లు