Homeగాసిప్స్టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకున్న కెజిఎఫ్ దర్శకుడు

టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకున్న కెజిఎఫ్ దర్శకుడు

టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకున్న కెజిఎఫ్ దర్శకుడు
టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకున్న కెజిఎఫ్ దర్శకుడు

కెజిఎఫ్ తో అందరూ ఆశ్చర్యపోయే రేంజ్ సినిమాను అందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సాధారణంగా చిన్న బడ్జెట్ లో, వేరే భాషల్లోకి కూడా పెద్దగా డబ్బింగ్ అవ్వని కన్నడ సినిమాను జాతీయ స్థాయిలో గర్వపడేలా నిలబెట్టాడు. అన్ని ఇండస్ట్రీల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. కెజిఎఫ్ విడుదలైన దగ్గరనుండి ప్రశాంత్ నీల్ తో పనిచేయాలన్న కోరికను చాలా మంది తెలుగు హీరోలు కనబర్చారు. ప్రస్తుతం ఈ కెజిఎఫ్ దర్శకుడు, రెండో పార్ట్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. కెజిఎఫ్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే కెజిఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఏంటా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే జోరుగా రూమర్స్ వ్యాప్తి చెందుతున్నాయి. అయితే చాలా మంది హీరోల పేర్లు ఈ రూమర్స్ లో భాగంగా వినిపిస్తున్నా ఇంకా ఎవరూ కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే ఒకటి మాత్రం నిజం. ప్రశాంత్ నీల్ తన తర్వాతి సినిమాను తెలుగు హీరోతోనే చేయబోతున్నాడు.

కెజిఎఫ్ 2, మొదటి భాగం కన్నా మరింత భారీగా ఉండనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో విలన్ గా సంజయ్ డాట్ నటిస్తుండడంతో బాలీవుడ్ వాళ్ళ దృష్టి ఈ చిత్రంపై అధికంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే కెజిఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది. అందుకే కన్నడ హీరోలు కంటే తెలుగు హీరోలైతే ప్యాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అవుతుందని ప్రశాంత్ నమ్ముతున్నాడు. ఈ నేపథ్యంలో ఇక్కడి టాలీవుడ్ టాప్ స్టార్స్ తో ప్రశాంత్ టచ్ లో ఉంటున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ తో సినిమా అంటూ జోరుగా ప్రచారం జరిగింది కూడా. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అయితే అధికారికంగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని ప్రకటించింది. ఇద్దరి మధ్యా ఇప్పటికే కథాచర్చలు కూడా జరిగాయి. అయితే ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటో తెలియలేదు కానీ కొన్ని వారాల క్రితం ప్రశాంత్ హైదరాబాద్ వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

ఇంకేముంది, బాబుతో ఈ కెజిఎఫ్ దర్శకుడి ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా అని జోరుగా మీడియా కథనాలు కూడా ప్రచురించింది. రెండు, మూడు సిట్టింగ్స్ అయినా కూడా కథ విషయంలో క్లారిటీ వచ్చినట్లు లేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టి ప్రభాస్ తో టచ్ లోకి రావడం టాలీవుడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్ ను కలిసి స్టోరీలైన్ చెప్పగా దానికి ఇంప్రెస్ అయిన ప్రభాస్ కచ్చితంగా సినిమా చేద్దామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ అయితే బాలీవుడ్ లో మార్కెట్ బాగుంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ బెస్ట్ అని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తుండగా ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు దర్శకులు కలిసి ప్రభాస్ కు కథలు వినిపించారు. మరి ప్రభాస్ ఎవరికి ఓకే చెబుతాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All