జగన్ సర్కర్..మొదటి నుండి పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కక్ష్య సాధింపు చర్య చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ గత చిత్రం వకీల్ సాబ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో..భీమ్లా నాయక్ విషయంలోనూ అలాగే చేసింది. బెనిఫిట్ షోస్ కు , అదనపు షోస్ కు అనుమతి ఇవ్వకపోవడం పోవడం, టికెట్ ధరలు పెంచకపోవడం వంటివి చేసింది. ప్రభుత్వ తీరు పట్ల అభిమానులతో పాటు చిత్రసీమ వర్గాలు, రాజకీయనేతలు , మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ సైతం ట్విట్టర్ ద్వారా జగన్ సర్కారు ఫై ఫైర్ అయ్యారు.
సృజన.. సాంకేతికత మేళవించిన రంగం సినిమా అన్నారు. సినీరంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి? అని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? అని నిలదీశారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి.. కానీ కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు..? అని ట్వీట్ చేశారు. ఎంత ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అడ్డుకట్ట వేయలేరని హితవు పలికారు.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive ??????#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022