రాజమౌళి `బాహుబలి`తో ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తరువాత వచ్చిన `సాహో` కూడా ఆ క్రేజ్ని కంటిన్యూ చేస్తూ ప్రభాస్ని పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది. దీంతో ప్రభాస్ వైపు యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఆసక్తిగా చూడటం మొదలుపెట్టింది. `బాహుబలి` విజయంతో ఇండియాలోని టాప్ స్టార్ల జాబితాలో చేరిపోయిన ప్రభాస్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 2019 సంసవత్సరానికి గానూ ఎంటర్టైన్మెంట్ రంగంలో అత్యతం ప్రభావవంతమైన 100 మంది జాబితాతో పాటు వారు ఎంత ఆదాయాన్ని పొందుతున్నారో ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది.
ఈ జాబితాలో బాహుబలి ప్రభాస్ (35 కోట్ల) 44వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిని ప్రభాస్కు ఈ దఫా దక్కడం విశేషంగా చెప్పుకుంటున్నారు. గత ఏడాది ప్రకటించిన లిస్ట్లో 33వ స్థానంలో నిలిచిన మహేష్ (35 కోట్లు) ఈ దఫా 54వ స్థానానికి పడిపోయారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ (21.5 కోట్లు) తొలిసారి 77వ స్థాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ జాబిలోని మొదటి స్థానంలో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (252.72 కోట్లు) నిలిచారు. అక్షయ్కుమార్ 293.25 కోట్లతో రెండవ స్థానాన్ని దక్కించుకోగా గతేడాది రెండవ స్థానంలో నిలిచిన సల్మాన్ఖాన్ 229. 5 కోట్లతో మూడవ స్థానానికి పడిపోయారు.
మిగతా స్థానాల్లో లమితాబ్ 239 కోట్లు, మహేంద్ర సింగ్ ధోని 135. 93 కోట్లు, షారుఖ్ఖాన్ 124. 38 కోట్లు, రణ్వీర్సింగ్ 118.2 కోట్లు, అలియాభట్ 59.21 కోట్లు, సచిన్ టెండూల్కర్ 76 కోట్లు, దీపికా పదుకోన్ 48 కోట్లతో టాప్ 10 జాబితాలో నిలిచారు. ఆ తరువాత స్థానాల్లో రజనీకాంత్, రజనీకాంత్, అజయ్ దేవ్గన్, ఆమీర్ఖాన్, రెహమాన్, హృతిక్ రోషన్ తదితరలు నిలిచారు.