Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కు ప్రభాస్ ఇలాంటి షాక్ ఇచ్చాడేంటి..?

ఫ్యాన్స్ కు ప్రభాస్ ఇలాంటి షాక్ ఇచ్చాడేంటి..?

Prabhas talks about his social media activity
Prabhas talks about his social media activity

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది. బాహుబలి తర్వాత నార్త్ లో కూడా ప్రభాస్ కు అభిమానులు అవ్వగా..సాహో తో నార్త్ స్టార్ అయ్యాడు. ముఖ్యంగా సోషల్ మీడియా లో ప్రభాస్ కు భారీగా ఫాలోయర్స్ అయ్యారు. ప్రభాస్ సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండనప్పటికీ..ఫాలోయింగ్ మాత్రం పిక్ లెవల్లో ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం..అది కూడా భారీ బడ్జెట్ తో పలు భాషల్లో రిలీజ్ అవుతుండడం తో ఈ సినిమా కోసం అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడాడు. ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇస్తూ తాను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటానని, రాబోయే రోజుల్లో తన సోషల్ మీడియా యాక్టివిటీని ఇంకా తగ్గించాలని అనుకుంటున్నట్టు చెప్పి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే ప్రభాస్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా టచ్ లో ఉంటాడని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ కు..ఇప్పుడు ప్రభాస్ ఇలా చెప్పేసరికి మరింత ఫీల్ అవుతున్నారు. ఈరోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడం తో చిన్న హీరోల దగ్గరి నుండి పెద్ద హీరోల వరకు సోషల్ మీడియా లో యాక్టివ్ అవుతుంటే..పాన్ ఇండియా స్టార్ అయ్యి ఉండి ప్రభాస్ ఇంకాస్త యాక్టివిటీని తగ్గిస్తానని చెప్పడం అంత షాక్ అవుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All