పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ లవ్స్టోరీ `రాధేశ్యామ్`. రాధాకృష్ణకుమార్ అత్యంత భారీ స్థాయిలో పిరియాడిక్ వింటేజ్ ప్రేమగాథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని ఈ రోజు ఆవిష్కరించారు.
ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే ఒక అందమైన క్షణాన్ని పంచుకుంటున్న దృశ్యానికి సంబంధించిన స్టిల్ అది. వెన్నేళ్లే మంచుపై పడుకుని ఆకాశం వంక తదేకంగా చూస్తున్న హీరో హీరోయిన్ల పిక్ బ్యూటిఫుల్గా వుంది. ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. కొత్త ప్రపంచాన్ని ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మేకర్స్ పరిచయం చేయబోతున్నారు.
ఓ వింటేజ్ లవ్స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు సినిమాని మరో వెలెల్కి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మోషన్ పోస్టర్తో సర్వత్రా సంచలనంగా మారిన `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ ప్రభాస్కి తల్లిగా కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ఈ సంవత్సరం జూలై 30 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.