మహాభారతంలో నటించాల్సి వస్తే అర్జునుడి పాత్ర చేయడానికి సిద్ధం అంటూ సంకేతాలు ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్ . సాహో ఈనెల 30 న భారీ ఎత్తున విడుదల అవుతున్న సందర్బంగా నిన్న సాయంత్రం బెంగుళూర్ వెళ్లిన ప్రభాస్ అక్కడ మీడియాతో సమావేశమయ్యాడు . కర్ణాటక మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మహాభారతంలో అర్జునుడి క్యారెక్టర్ నాకు బాగా నచ్చిందని , ఒకవేళ నటించాల్సి వస్తే అర్జునుడిగా నటిస్తానని తెలిపాడు ప్రభాస్ .
దర్శకులు రాజమౌళి మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించిన విషయం తెలిసిందే . మహాభారతాన్ని భారీ ఎత్తున రూపొందించాలని కళలు కంటున్నాడు జక్కన్న . దాంతో అందులో అర్జునుడిగా ప్రభాస్ ఫిక్స్ అయినట్లే అనుకుంటా ఒకవేళ జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళితే …… ఇక సాహో విషయానికి వస్తే తెలుగు , తమిళ , హిందీ బాషలలో ఏకకాలంలో విడుదల అవుతోంది దాంతో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు ప్రభాస్ .