Homeటాప్ స్టోరీస్ప్రభాస్, ప్రశాంత్ నీల్ పీరియాడిక్ డ్రామా కథ ఏంటి?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ పీరియాడిక్ డ్రామా కథ ఏంటి?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ పీరియాడిక్ డ్రామా కథ ఏంటి?
ప్రభాస్, ప్రశాంత్ నీల్ పీరియాడిక్ డ్రామా కథ ఏంటి?

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే బిజియస్ట్ స్టార్స్ లో ఒకడు అనడంలో సందేహం లేదు. వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్. రాధే శ్యామ్ పూర్తి కావొచ్చింది. ఆది పురుష్, సలార్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. నాగ్ అశ్విన్ తో సినిమాను వచ్చే ఏడాది మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ 25వ సినిమా గురించి ఇప్పటి నుండే వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం కమిటైన సినిమాలు అన్నీ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ తో మరోసారి పనిచేయనున్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా అని, బాహుబలిని మించిన స్పాన్ ఉన్న కథ అని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ మధ్య దీని గురించి చర్చలు నడిచాయని తెలుస్తోంది.

- Advertisement -

ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తర్వాత భారీ ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 పూర్తయ్యాక టాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంది. మళ్ళీ ప్రభాస్ తో పనిచేయనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All