Homeగాసిప్స్ప్రభాస్ జాన్ సినిమా కథ ఇదేనా ..?

ప్రభాస్ జాన్ సినిమా కథ ఇదేనా ..?

ప్రభాస్ జాన్ సినిమా కథ ఇదేనా ..?
ప్రభాస్ జాన్ సినిమా కథ ఇదేనా ..?

ఓపెన్ చేస్తే ఇటలీలో ఒక ప్రేమ జంట. ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం. వారిద్దరిలో ఒకరిది ఇండియా, మరొకరిది ఇటలీ. ఇద్దరూ డీప్ గా ప్రేమించుకున్నారు. కట్ చేస్తే వాళ్ళిద్దరు దూరం కావాల్సి వచ్చింది. ఒకరు ఇటలీలో ఉండిపోతే, మరొకరు ఇండియా కి వెళ్ళిపోయారు. దూరమైన వాళ్ళు ప్రశాంతంగా బతకలేరు కదా..! అందుకే దూరమైన తన లవర్ కోసం ఇటలీ నుంచి ఇండియాకి ప్రయాణం చేశాడు మన హీరో. అందులో భాగంగా మొట్టమొదటి సీన్ ఇటలీ లో ఉండే ఒక ట్రైన్ లో మొదలవుతుంది. అది మామూలు ట్రైన్ కాదు ట్రామ్. సారీ చెప్పడం మర్చిపోయాను ఈ కథ 1970 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.

ఇది ప్రస్తుతానికి ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా జాన్ కథ.

- Advertisement -

సాహో తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాలవల్ల సాహో సినిమా లేట్ అయింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో జాన్ సినిమాని మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని పని చేస్తున్నాడు ప్రభాస్.

గోపీచంద్ తో జిల్ అనే సినిమా తీసిన కే.రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ ఆస్థాన సంస్థ యు వి క్రియేషన్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రభాస్ సాహో సినిమా కి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన గిభ్రాన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక సెట్ లో ప్రారంభం కాబోతోంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తో మగధీర, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అత్తారింటికి దారేది సినిమాలకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఇటలీ నేటివిటీ ఉండేలా ఒక మంచి సెట్ ను, అందులో భాగంగా 50 లక్షల ఖర్చుతో ఒక ట్రామ్ ట్రైన్ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభాస్ ఈ సినిమాలో పెర్ఫ్యూమ్ మేకర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది కాకపోతే మన్మధుడు 2 సినిమా లో నాగార్జున ఇప్పటికే అలాంటి పాత్ర చేసి ఉండడంతో కొద్దిగా హీరో క్యారెక్టరైజేషన్ లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ సినిమా ఎంత తొందరగా రిలీజ్ అయితే ఫ్యాన్స్ అంత హ్యాపీ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All