ప్యాన్ ఇండియన్ టాప్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస ప్యాన్ ఇండియా చిత్రాలతో సూపర్ బిజీగా మారిన విషయం తెల్సిందే. సాహో తర్వాత ప్రభాస్ కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చింది. అయితే ప్రభాస్ తన సినిమాలను వరసగా విడుదల చేయడానికి ప్లాన్ చేసాడు. ముందుగా రాధే శ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసాడు ప్రభాస్. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇక మైథలాజికల్ డ్రామా ఆది పురుష్ లో కూడా ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసాడు. రీసెంట్ గా హీరోయిన్ కృతి సనన్, లక్ష్మణుడిగా నటిస్తోన్న సన్నీ సింగ్ లు కూడా తమ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయగా ఇప్పుడు ప్రభాస్ కూడా తన వంతు షూటింగ్ ను పూర్తి చేసాడు. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ కు కేక్ తినిపిస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిర్మాణ సంస్థ. టి సిరీస్ ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో తెరకెక్కిస్తోంది. అత్యాధునిక సాంకేతికత వాడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాడు.
ఆగస్ట్ 11, 2022న ఆది పురుష్ విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఈ చిత్ర టీమ్ దాదాపుగా ఆరు నెలలు తీసుకోనున్నారు.