ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. `బాహుబలి`, సాహో` వంటి భారీ చిత్రాల తరువాత ఆయన నుంచి సినిమా అంటే దేశ వ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ అవుతోంది. భాషా బేధాలు లేకుండా అన్ని ప్రాతాలు, భాషల వారు ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా ప్రభాస్ నటించనున్న `ఆదిపురుష్` మూవీ కోసం దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.
3డీ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో 500 కోట్ల బడ్జెట్ తో టి సిరీస్ సంస్థ నిర్మించబోతోంది. రామాయణ గాథ నేపథ్యంలో కొత్త తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీపై దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్కి తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా దీపావళి సందర్భంగా మరో ఫ్యాన్మేడ్ పోస్టర్ బయటికి వచ్చింది. కండలు తిరిగి ఆరుపలకల దేహంతో రాముడిగా ప్రభాస్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూడముచ్చటగా వుండటంతో చిత్ర దర్శకుడు ఓమ్రౌత్ ఎక్స్లెంట్గా వుందని కామెంట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాహుబలితో ఓ రేంజ్లో కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలోనూ మరింత ఫిట్గా అందాల రాముడిగా కనిపించనున్నడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్ర రెగ్యులర్ షూట్ని ప్రారంభించాలని దర్శకుడు ఓమ్రౌత్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాడు.