పూనమ్ కౌర్ చాల ఏళ్ల తర్వాత డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది..మాట్లాడమే కాదు పలు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈమె నటించిన నాతిచరామి మూవీ ఈ వారం ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఉమెన్ సెంట్రిక్ సినిమా కావడంతో ఉమెన్స్ డే సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ని ఏర్పటు చేసారు. వేదిక ఫైకి వచ్చి రావడమే ఎమోషనల్ అయ్యింది.
సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేసి మధ్యతరగతి యువతి పెళ్లి కలను చెదరగొట్టారు అని ఆరోపించారు. ఎన్నో పెద్ద సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా చుట్టూ ఉండే రావణులు చెడగొట్టారు అంటూ తనలోని బాధను మీడియా ముందు వ్యక్తం చేసి కన్నీరు పెట్టుకుంది. మూడేళ్లుగా వ్యక్తిగతంగానూ, ఆరోగ్యపరంగా ఎంతో నష్టాన్ని అనుభవించానని ఆమె పేర్కొన్నారు. ఎంత జరిగినా వెనకడుగు వేయకుండా సీతాదేవి, ద్రౌపది, దుర్గాదేవి స్ఫూర్తితో మళ్లీ పరిశ్రమలో గెలుపు కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టానని తెలిపింది. ఇక ఈ మూవీ లో ఇందు పాత్ర నా పాత్రకు దగ్గరిగా ఉందని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాను నాగు గవర తెరకెక్కించగా అరవింద్ కృష్ణ, సందేష్ బూరి ఇతర ముఖ్య పాత్రధారులుగ నటించారు. స్టూడియో 24 ఫ్రేమ్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ఓటీటీ విడుదల కాబోతుంది.