టాలీవుడ్లో క్రేజీ కథానాయికగా పేరుతెచ్చుకుంది పూజా హెగ్డే. ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంతో బుట్టబొమ్మలా ప్రేక్షకుల ముందుకొచ్చిన పూజా తన ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. వరుస ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న పూజాహెగ్డే తెరపై గ్లామర్గా కనిపించడమే కాదు తెర ముందు ఉదరతను కూడా చాటుకుంటోంది.
ఇప్పటికే ఆపన్నుల అండగా నిలుస్తూ ప్రత్యూశ షౌండేషన్ ద్వారా స్టార్ హీరోయిన్ సహాయం అందిస్తుంటే తాజాగా ఆ జాబితాలో పూజా హెగ్డే కూడా చేరిపోయింది. క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం 2.50 లక్షలు విరాళం ప్రకటించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో `క్యూర్ ఫౌండేషన్` వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూజా హెగ్డే ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆమె క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారులరు విరాళాన్నప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ `నేను వైద్యుల కుటుంబం నుంచే వచ్చాను. మా అన్నయ్య డాక్లర్. స్నేహితులు కూడా వైద్య వృత్తిలోనే వున్నారు. వైద్యుడే నిజమైన హీరో అని నేను భావిస్తాను. బాధిత చిన్నారుల కోసం వీలైనన్ని నిధులు సమకూర్చి పిల్లల్ని కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతీ ఒక్కరికీ మంచి పనులు చేయాలని వుంటుందని, కానీ ఎలా చేయాలో అవగాహన వుండదని, ఇలాంటి ఆర్గనైజేషన్ల ద్వారా ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను` అన్నారు.