పూజా హెగ్డే.. టాలీవుడ్ హీరోలు కలవరిస్తున్న పేరిది. హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా ఇదే నామం జపిస్తున్నారు. పూజా పేరు జపిస్తున్న టాప్ దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు ప్రధమంగా వినిపిస్తోంది. పూజా హెగ్డేతో త్రవిక్రమ్ ఇప్పటి వరకు రెండు చిత్రాలు చేశారు. ఒకటి `అరవింద సమేత`. మరొకటి `అల వైకుంఠపురులో`.
ఈ రెండు చిత్రాల్లో బన్నీతో త్రివిక్రమ్ చేసిన `అల వైకుంఠపురములో` ఇండస్ఠ్రీ హిట్ గా నిలిచింది. ఈ రెండు చిత్రాల తరువాత త్రవిక్రమ్ ముచ్చటగా మూడవ సారి పూజా హెగ్డేని రిపీట్ చేయబోతున్నారని తెలిసింది. అదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రంతో అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ భారీ చిత్రాన్ని త్వరలో సెట్స్ పైకి తీసుకురానున్న విషయం తెలిసిందే.
సమకాలీన రాజకీయాలపై వ్యంగ్రాస్త్రంగా త్రివిక్రమ్ తెరకెక్కించనున్న ఈ మూవీలో ఎన్టీఆర్కి జోడీగా పూజా హెగ్డే నటించనుందని తెలిసింది. జాన్వీకపూర్, కియారా లాంటి వారి పేర్లని పరిశీలించిన త్రివిక్రమ్ ఫైనల్గా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు తెలిసింది.