దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎక్కడ చూసినా కోవిడ్ కేసులే. పట్టణాల నుంచి పల్లెల దాకా రోజు రోజుకీ రికార్డు స్థాయి కేసులే కాకుండా రికార్డు స్థాయి మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఇదిలా వుంటే సినీ వర్గాల్లో కోవిడ్ సోకుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు, దర్శకులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో మరో హీరోయిన్ చేరింది.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. `అందరికీ హలో.. నేను కోవిడ్ పరీక్ష చేయించుకున్నాను. నాకు పాజిటివ్ అని తేలింది ఆ విషయం మీతో పంచుకుంటున్నాను. కోవిడ్ నిబంధనలని అనుసరించి నేను స్వీయ నిర్భంధంలోక వెళ్లాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోమని నేను అభ్యర్థిస్తున్నాను` అని పోస్ట్ చేసింది.
ఇదే సందర్భంగా తాను కోలుకుంటున్నానని వెల్లడించింది. `ప్రేమ, మీ మద్దతుకు ధన్యవాదాలు. నేను ప్రస్తుతం బాగా కోలుకుంటున్నాను. దయచేసి ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, జాగ్రత్త వహించండి` అని తెలిపింది పూజా హెగ్డే. ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్తో ఓ భారీ చిత్రంలో నటిస్తోంది.
???????????? pic.twitter.com/fwdd9Cq1Go
— Pooja Hegde (@hegdepooja) April 25, 2021