టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అల వైకుంఠాపురములో` విజయంతో గత ఏడాది సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ని ఖాతాలో వేసుకుని స్టార్డమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న`రాధే శ్యామ్`తో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. ఈ చిత్ర విడుదల కోసం పూజా ఎదురుచూస్తోంది. ఇటీవల పూజా హెగ్డే సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటోంది.
పూజా హెగ్డే ఇటీవల అభిమానులతో ఆన్లైన్ లో ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ని నిర్వహించింది. తన భిన్నమైన చిత్రాలను పోస్ట్ చేయమని అభిమానులు పూజను ఈ సందర్భంగా కోరారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక అభిమాని పూజా హెగ్డేను నేకెడ్ పిక్చర్ పోస్ట్ చేయమని కోరాడు. దీంతో పూజా హెగ్డే ఊహించని రీతిలో స్పందించి అతనికి షాకిచ్చింది.
పూజా హెగ్డే ఆమె కాళ్ళకు సంబంధించిన చిత్రాన్ని పోస్ట్ చేసి, `నంగే పావ్` అంటూ తన కాళ్లని చూపించింది. దీంతో సదరు అభిమానికి దిమ్మదిరిగిపోయిందట. పూజా నుంచి స్మార్ట్ రిప్లై రావడంతో ఏం చేయాలలో సదరు అభిమానికి తోచలేదట. పూజా హెగ్డే ప్రస్తుతం హిందీ చిత్రాల్లో బిజీగా వుంది. `ఆచార్య` చిత్రంలో రామ్చరణ్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్చరణ్కు జోడీగా పూజా హెగ్డే కనిపించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.