`అఆ` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో 50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు నితిన్. ఈ సినిమా తరువాత తన పంథాను మార్చుకున్నాడు. తను చేసే ప్రతి చిత్రంలోనూ క్రేజీ కథానాయిక వుండేలా ప్లాన్ చేసుకుంటూ వరుస విజయాల్ని దక్కించుకుంటున్నాడు. `శ్రీనివాస కల్యాణం`లో రాశి ఖన్నా, భీష్మలో రష్మిక మందన్న, రంగ్ దే చిత్రంలో కీర్తి సురేష్లతో కలిసి నటించేలా ప్లాన్ చేసుకున్నారు.
చంద్రశేఖర్ ఏలేటి చిత్రంలో నితిన్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. `పవర్ పేట`లోనూ కీర్తి సురేష్ నటించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే `అంధాదున్` రీమేక్ కోసం నితిన్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డేని సంప్రదించారట. ముందు ఈ సినిమా కోసం భారీగానే డిమాండ్ చేసిన పూజ ఆ తరువాత నితిన్ ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించినట్టు తెలిసింది.
కారణం వరుస క్రేజీ చిత్రాల్లో నటిస్తూ పూజా హెగ్డే బిజీగా వుండటమే నని, డేట్స్ సమస్య కారణంగానే ఆమె నితిన్ చిత్రానికి నో చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్తో `రాధేశ్యామ్`, అఖిల్ అక్కినేనితో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.