Homeగాసిప్స్ప‌వ‌ర్‌స్టార్‌ కోసం క్రేజీ హీరోయిన్‌!

ప‌వ‌ర్‌స్టార్‌ కోసం క్రేజీ హీరోయిన్‌!

ప‌వ‌ర్‌స్టార్‌ కోసం క్రేజీ హీరోయిన్‌!
ప‌వ‌ర్‌స్టార్‌ కోసం క్రేజీ హీరోయిన్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత `పింక్‌` రీమేక్‌తో మ‌ళ్లీ స్పీడు పెంచారు. హిందీలో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిచిన పాత్ర‌ని తెలుగులో ప‌వ‌న్ పోషిస్తున్నారు. హిందీ వెర్ష‌న్‌కి కంప్లీట్ కొత్త‌గా త‌మిళ రీమేక్‌ని రూపొందించారు. హీరో పాత్ర నిడివి, అత‌నికో హీరోయిన్‌, ఫ్లాష్ బ్యాక్, ఫైట్స్‌.. ఇలా కొత్త హంగుల‌న్నీ అద్ది స‌రికొత్త‌గా `నేర్కొండ‌పార్వై` పేరుతో రీమేక్ చేశారు. అక్క‌డ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో తెలుగులో మ‌రిన్ని మార్పుల‌తో తెర‌కెక్కిస్తున్నారు.

ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ప‌వ‌న్‌పై ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం ఆయ‌న లేకుండా కొన్ని సీన్‌ల‌ని క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు, కీల‌క పాత్ర‌ధారుల‌పై షూట్ చేస్తున్నారు. మూడ‌వ షెడ్యూల్‌లో మ‌ళ్లీ ప‌వ‌న్ పాల్గొంటార‌ట‌. అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అస‌లు హీరోయిన్ వుందా? ఉంటే ఎవరు లైన్‌లో వున్నారు? అన్న చ‌ర్చ గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్‌కు జోడీగా ఇద్ద‌రు క్రేజీ భామ‌ల్ని చిత్ర బృందం ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

పూజా హెగ్డే లేదా ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే పాత్ర కాబ‌ట్టి నిడివి తక్కువ వుంటుంద‌ని ఆ పాత్ర‌ని పూజా హెగ్డే తో చేపిస్తే బాగుంటుంద‌ని నిర్మాత దిల్ రాజు నిర్ణ‌యించేకున్నార‌ట‌. ఆమె కూడా ప‌వ‌న్‌తో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తుండ‌టం, ఒక స‌మ‌యంలో ఎక్కువ చిత్రాల్లో న‌టించాల‌ని భావిస్తుండ‌టంతో పూజా హెగ్డేనే `పింక్‌` రీమేక్ కోసం ఫైన‌ల్ చేస్తున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All