గత ఏడాది `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్లో క్వీన్ గా వెలిగిపోతూ భారీగా డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే కోసం స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వుంది పూజా హెగ్డే.
ఆమె తాజాగా మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సంక్రాంతికి `మాస్టర్` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ఈ మూవీ తరువాత నెల్సన్ దిలీప్కుమార్తో ఓ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తరువాత విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ మూవీ చేయబోతున్నారు.
ఈ చిత్రం కోసం విజయ్కి జోడీగా చిత్ర బృందం పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్టు తెలిసింది. పూజా హెగ్డే హిందీలో సల్మాన్ఖాన్తో `కబీ ఈద్ కబీ దివాలి`, రణ్వీర్ సింగ్తో `సర్కస్` చిత్రాల్లో నటిస్తోంది.