యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫై బుట్టబొమ్మ పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన రాధే శ్యామ్ మూవీ లో నటించింది. ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో చిత్ర ప్రమోషన్ లలో బిజీ గా మారింది. వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలతో పాటు ఇప్పటివరకు చేసిన హీరోల గురించి పలు కామెంట్స్ చేస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , ప్రభాస్ ల ఫై పలు కామెంట్స్ చేసింది.
సెట్లో ప్రభాస్ చాలా జోవియల్గా ఉంటారని, ఆయనతో షూటింగ్ చాలా ఫన్ అని, ప్రభాస్కి కొంత సిగ్గు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఎన్టీఆర్ హై ఎనర్జిటిక్ పర్సన్ అని ఆయనకు భాషపై కూడా పట్టు ఉంది కనుక ఏదైనా సరే సింగిల్ టేక్లో చేసేస్తాడనితెలిపింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటారని తెలిపి అభిమానులను ఆకట్టుకుంది.
కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ అయినా మెల్లగా స్టార్ హీరోలతో నటించే అవకాశం లభించింది. అలా ప్రభాస్తో సహా ఇప్పటిదాకా నటించిన అందరు హీరోలతో కెమిస్ట్రీ కుదరడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఇక రాధే శ్యామ్ విషయానికి వస్తే..కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమాకు ప్రమోద్, వంశీ, ప్రశీద నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీ లో విక్రమాదిత్య అనే హస్త సాముద్రికా నిపుణుడిగా విలక్షణ పాత్రలో ప్రభాస్ కనిపించగా.. కృష్ణం రాజు ముఖ్య పాత్ర పోషించారు.