Homeటాప్ స్టోరీస్రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వివేకానంద హత్య

రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వివేకానంద హత్య

Political heat in AP with YS Vivekananda murderఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది . నిన్న వై ఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే . అయితే మొదట గుండెపోటు అంటూ ప్రచారం సాగింది , 11 గంటల తర్వాత వివేకా ని హత్య చేసారని హడావుడి చేసారు .వివేకా డెడ్ బాడీని  ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది హత్యగా తేల్చారు డాక్టర్లు .

 

- Advertisement -

వివేకానంద ఇంట్లో ఒంటరిగా ఉండటం , రక్తం మడుగులో పడిఉండటం ఆపై శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది . ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తున్నది .  వివాదాలకు దూరంగా ఉండే వివేకానంద రెడ్డి ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు . వివేకా హత్యతో రాజకీయ వర్గాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది . ఇది ప్రభుత్వం చేయించిన హత్య అంటూ జగన్ ఆరోపిస్తుండగా తెలుగుదేశం పార్టీ కూడా తక్కువేమి తినలేదు వై ఎస్ వివేకానంద రెడ్డి ని మీరే చంపించారు అంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు . మొత్తానికి వివేకా హత్య ఆంధప్రదేశ్ రాజకీయాలలో సంచలనం అయ్యింది .

English Title : Political heat in AP with YS Vivekananda murder

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All