బాలీవుడ్ యుంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం తో సినీ ప్రపంచం షాక్ కు గురైంది . ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నామని కొంత మంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుశాంత్ ఆత్మహత్యపై ఫామిలీ మెంబర్స్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం సుశాంత్ ది ఆత్మ హత్యేనని డాక్టర్లు తేల్చారు . పోలీసులు మాత్రం పలు కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇందులో భాగంగా సుశాంత్ సింగ్ రాజపుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని పోలీసులు విచారించ నున్నారని తెలిసింది ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సుశాంత్ తన గర్ల్. రియాకు, స్నేహితుడు మహేష్ శెట్టి తో మాట్లాడాలని ప్రయత్నించారట. దీంతో ఆ ఇద్దరినీ పోలీస్ లు విచారించనున్నారని తెలిసింది.
- Advertisement -