Homeటాప్ స్టోరీస్మోడీ పట్టాభిషేకం నేడే

మోడీ పట్టాభిషేకం నేడే

భారత ప్రధానమంత్రి గా మళ్ళీ రెండోసారి పదవీ ప్రమాణం చేయనున్నారు నరేంద్ర మోడీ . దేశ వ్యాప్తంగా నమో …… నరేంద్ర మోడీ అనేలా చేసి సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించాడు దాంతో ఈరోజు అంగరంగ వైభవంగా మోడీ కి పట్టాభిషేకం జరుగనుంది . ప్రపంచ దేశాల నుండి పెద్ద ఎత్తున అతిథులు హాజరు కానున్నారు . కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి దేశ వ్యాప్తంగా కమలం వికసించేలా చేసాడు మోడీ .

- Advertisement -

ఈరోజు రాత్రి 7 గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ లో మోడీ కి పట్టాభిషేకం జరుగనుంది . రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు . ఇక ప్రధాని దాదాపు 64 మందితో మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది . తెలంగాణ నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన జి . కిషన్ రెడ్డి కి మంత్రి పదవి  ఛాన్స్ ఖాయమైనట్లు తెలుస్తోంది . ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కానున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All