హిందీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్`. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ డ్రామాలో కియారా అద్వానీ నటించిన పార్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 190కి పైగా దేశాల్లో 204 మిలియన్ల సభ్యత్వాలు నమోదు చేసుకుని ఓటీటీల్లో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ తెలుగులోనూ ఒరిజినల్స్ని ప్రారంభించింది.
లోకల్ కంటెంట్తో పాటు టాలెంట్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. నెట్ఫ్లిక్స్ ఇండియా ఇప్పటికే పలు ప్రాంతీయ భాషల్లో వెబ్ కంటెంట్కి ప్రాధాన్యతనిస్తూ పలు వెబ్ సిరీస్లని ప్రారంభించింది. తాజాగా `లస్ట్ స్టోరీస్` తరహాలోనే `పిట్టకథలు` పేరుతో తెలుగు ఒరిజినల్ ని నిర్మించింది. లక్ష్మీ మంచు, ఈషారెబ్బ శృతిహాసన్, అమలాపాల్ ఒక్కో సిరీస్లో నటించారు.
ఒక్కో భాగానికి నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, సంకల్ప్రెడ్డి, తరుణ్ భాస్కర్, దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్కి సంబంధించిన టీజర్ని బుధవారం నెట్ఫ్లిక్స్ ఇండియా విడుదల చేసింది. శృథిహాసన్ నటించిన పార్ట్కి నాగ్ అశ్విన్, లక్ష్మీ మంచు నటించిన పార్ట్కి నందిని రెడ్డి, అమలాపాల్ నటించిన పార్ట్కి సంకల్ప్రెడ్డి, ఈషా రెబ్బ నటించిన పార్ట్కి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. భావోద్వేగాలతో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువే వున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 19 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. మిగతా ప్రధాన పాత్రల్లో అషిమా నర్వాల్, జగపతి బాబు, సత్య దేవ్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే నటించారు.
Samayam vachesindi. Our first Telugu language Original is heading your way, take a peek.@TharunBhasckerD @LakshmiManchu @SaanveMegghana @bethiganti_ @nandureddy4u @IamJagguBhai @Amala_ams #AshwinKakamanu @nagashwin7 @shrutihaasan @TheSanjithhegde #SangeethShoban @anishkuruvilla pic.twitter.com/hlLYwor1Ws
— Netflix India (@NetflixIndia) January 20, 2021