హిందీలో బిగ్బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించి `పింక్` సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇదే చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా బోనీ కపూర్ తెరకెక్కించారు. నేర్కొండపార్వై` పేరుతో `ఖాకీ` ఫేమ్ హెచ్. వినోద్ రూపొందించిన ఈ చిత్రం అక్కడ కూడా సంచలనం సృష్టించింది. తాజాగా ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. బోనీకపూర్తో కలిసి దిల్రాజు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.
పవన్ ఇమేజ్కి అనుగుణంగా కథలో మార్పులు చేసిన చిత్ర బృందం సినిమాకు కీలకమైన కోర్టు సెట్ని భారీగా నిర్మిస్తున్నట్టు తెలిసింది. ఇందు కోసం కోర్టు సెట్ని అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నేతృత్వంలో నిర్మిస్తున్నారు. సెట్ వర్క్ పూర్తి కాగానే కీలక సన్నివేశాల్ని అందులో చిత్రీకరిస్తారట. కోర్టు హాలు లోనే అత్యధిక శాతం చిత్రీకరణ వుంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా సెట్ని ఏర్పాటు చేస్తున్నారట.
`అజ్ఞాతవాసి` ఫ్లాప్ తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ఎంటరైన పవన్ కల్యాణ్ తాజా రీమేక్తో మళ్లీ తన జోరు పెంచబోతున్నారు. `పింక్` రీమేక్ పూర్తయిన వెంటనే మరో రెండు చిత్రాల్ని పట్టాలెక్కించే పనిలో వున్నారట. ఆ కారణంగానే ఈ చిత్రానికి కేవలం 20 రోజుల్ని మాత్రమే పవన్ కేటాయించినట్టు చెబుతున్నారు. ఈ సినిమా కోసం పవన్ భారీగానే పారితోషికం డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.