హీరోనే నమ్మించి మొసం చేసి ఆ తరువాత హత్య చేయించే హీరోయిన్ పాత్రలో నటించిన సంచలనం సృష్టించింది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రం `Rx100` ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ తొలి సినిమాతో హీరోయిన్గా సంచలనం సృష్టించింది. తాజాగా విస్కీ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా మారి షాకిస్తోంది. ఆల్కహాల్ బేస్డ్ యాడ్స్కి లేదా ఉత్పత్తులకి హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వుంటారు.
కానీ ట్రెండుని మార్చి పాయల్ కొత్తట్రెండ్ని సెట్ చేసింది. పాయల్ రాజ్పుత్ ఒక ప్రసిద్ధ బ్రాండ్ విస్కీని ప్రోత్సహిస్తున్నారు. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో గ్లాస్ విస్కీతో వున్న ఫొటోని పంచుకున్న పాయల్ ఆ ఫొటోకు ఆసక్తికరమైన వ్యాఖ్యని జత చేసింది. తెలంగాణలో లభించే సరికొత్త సున్నితమైన ఖరీదైన విస్కీ అని క్యాప్షన్ ఇచ్చింది. మన నటులు లేదా నటీమణులు చాలా మంది మద్యం సేవించినప్పటికీ వారు బహిరంగంగా దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు కానీ పాయల్ మాత్రం అందిరికి భిన్నంగా విస్కీని ప్రమోట్ చేస్తుండటం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ రోజుల్లో ఆల్కహాల్ బ్రాండ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్న హీరోయిన్ గా పాయల్ రికార్డు నెలకొల్పేలా వుందని అంతా అంటున్నారు. సుందీప్ కిషన్, నిఖిల్ వంటి యువ హీరోలు కొందరు ఆల్కహాల్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్లో కనిపించినప్పటికీ నటీమణులు సాధారణంగా వీటికి దూరంగా ఉంటారు. కానీ వారికి భిన్నంగా పాయల్ రాజ్పుత్ విస్కీ ప్రకటన వుండటం ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.