పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కొండగట్టు అంజన్న ఆశీస్సులు కావాలట. అందుకే అతి త్వరలో నే కొండగట్టు కు వెళ్లి ఆంజనేయస్వామి ఆశీస్సులు పొందాలని భావిస్తున్నాడు . అక్కడి నుండే రాజకీయ యాత్ర ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజారాజ్యం తరుపున ప్రచారం చేసాడు పవన్ కళ్యాణ్.
ఆ సమయంలో కొండగట్టు సమీపంలో కరెంట్ తీగలు తగిలాయి పవన్ కు కానీ అదృష్టవశాత్తు షాక్ తగలలేదు కాకపోతే స్వల్ప షాక్ కి గురయ్యాడు దాంతో ఆంజనేయస్వామి నుండి తన యాత్ర మొదలు పెట్టాలని భావిస్తున్నాడు పవన్ . పైగా మెగా కుటుంబానికి ఆంజనేయ స్వామి అంటే అమితమైన భక్తి , ఆ ఇంటి ఇలవేల్పు దాంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్ర ని కొండగట్టు నుండి ప్లాన్ చేసాడు జనసేన అధినేత.
- Advertisement -