Homeఎక్స్ క్లూసివ్అంజన్న ఆశీస్సులు కోరుతున్న పవన్

అంజన్న ఆశీస్సులు కోరుతున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కొండగట్టు అంజన్న ఆశీస్సులు కావాలట. అందుకే అతి త్వరలో నే కొండగట్టు కు వెళ్లి ఆంజనేయస్వామి ఆశీస్సులు పొందాలని భావిస్తున్నాడు . అక్కడి నుండే రాజకీయ యాత్ర ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజారాజ్యం తరుపున ప్రచారం చేసాడు పవన్ కళ్యాణ్.

ఆ సమయంలో కొండగట్టు సమీపంలో కరెంట్ తీగలు తగిలాయి పవన్ కు కానీ అదృష్టవశాత్తు షాక్ తగలలేదు కాకపోతే స్వల్ప షాక్ కి గురయ్యాడు దాంతో ఆంజనేయస్వామి నుండి తన యాత్ర మొదలు పెట్టాలని భావిస్తున్నాడు పవన్ . పైగా మెగా కుటుంబానికి ఆంజనేయ స్వామి అంటే అమితమైన భక్తి , ఆ ఇంటి ఇలవేల్పు దాంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్ర ని కొండగట్టు నుండి ప్లాన్ చేసాడు జనసేన అధినేత.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All