Homeటాప్ స్టోరీస్ప‌వ‌ర్‌స్టార్ - క్రిష్ మూవీ మ‌ళ్లీ మొద‌లైంది!

ప‌వ‌ర్‌స్టార్ – క్రిష్ మూవీ మ‌ళ్లీ మొద‌లైంది!

ప‌వ‌ర్‌స్టార్ - క్రిష్ మూవీ మ‌ళ్లీ మొద‌లైంది!
ప‌వ‌ర్‌స్టార్ – క్రిష్ మూవీ మ‌ళ్లీ మొద‌లైంది!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. దీంతో ప‌వ‌న్ సోమ‌వారం నుంచి క్రిష్ పిరియాడిక్ డ్రామాని మ‌ళ్లీ మొద‌లుపెట్టారు. ప‌వన్‌క‌ల్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా సూర్యా ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం పిరియాడిక్ స్టోరీతో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

లాక్‌డౌన్‌కి ముందు ప్రారంభ‌మైన ఈ మూవీ ఆ త‌రువాత ఆగిపోయింది. ఇటీవ‌ల `ఉప్పెన‌` ఫేమ్‌తో మినిమ‌మ్ బ‌డ్జెట్ ఫిల్మ్‌ని రాకెట్ స్పీడుతో పూర్తి చేసిన క్రిష్ కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కోవిడ్ నుంచి కోలుకున్న ఆయ‌న తిరిగి ప‌వ‌న్ మూవీని మొద‌లుపెట్టారు. ఇందుకు సంబంధించిన వార్త‌ని మెగా సూర్యా ప్రొడ‌క్ష‌న్స్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. `ఓ గ్రేట్ న్యూస్‌ని మీ అంద‌రితో పంచుకోవాల‌నుకుంటున్నాం. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు క్రిష్ చిత్రాన్ని మొద‌లుపెట్టారు. PSPK27కి సంబంధించిన మ‌రిన్ని అప్ డేట్స్‌ని తెలుసుకోవాలంటే మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి` అంటూ ట్వీట్ చేసి ఆల్ లొకేష‌న్‌కి సంబంధించిన ఫొటోల‌ని రిలీజ్ చేశారు.

- Advertisement -

ఈ షెడ్యూల్ పూర్త‌యిన త‌రువాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రీమేక్ కానున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొంటార‌ట‌. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All