తన తల్లికి న్యాయం జరగకపోతే కొడుకుగా నేను బ్రతికి వేస్ట్ అందుకే చచ్చిపోతా అని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్ . ఈరోజు ఉదయం ఫిలిం ఛాంబర్ కు నాగబాబు తో కలిసి వెళ్లిన పవన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై అలాగే సినీ పరిశ్రమ పెద్దలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు . నెల రోజులుగా ఇంత పెద్దున రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ ఇంకా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ……. 24 గంటల టైం ఇస్తున్నాను ఆలోగా సమస్య ని పరిష్కరించకపోతే నేనేమి చేయాలో అది చేస్తానని హెచ్చరికలు జారీ చేసాడు పవన్ కళ్యాణ్ .
అయితే మెగా హీరోలు ఫిలిం ఛాంబర్ కు వచ్చారని మెగా అభిమానులకు తెలియడంతో వెంటనే పెద్ద ఎత్తున తరలివచ్చారు . దాంతో పోలీసులు జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ , నాగబాబు , అల్లు అర్జున్ , రాంచరణ్ లను రిక్వెస్ట్ చేయడంతో ఫిలిం ఛాంబర్ నుండి వెళ్లిపోయారు . 24 గంటల సమయం ఇస్తున్నాను , మీ వల్ల కాకపోతే నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ . అయితే తల్లి కోసం చచ్చిపోతా అని పవన్ పేర్కొనడం అభిమానుల గుండె రగిలేలా చేస్తోంది .