అందరికీ వినోదాన్ని పంచె సినిమాల్లో భాగమైన వారికీ సొంత ఇంటికల నెరవేరే క్రమంలో చిత్రపురి కాలనీలో ఎదురవుతున్న సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.
చిత్రపురిలో ఇళ్ళు దక్కక వేదనకు లోనవుతున్న వారికీ, భరోసాగా వుండి, వారి గొంతుకనవుతానని హామీ ఇచ్చారు. ఆ అంశంపై ఎన్.శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, పరచూరి వెంకటేశ్వర రావ్ గారితో చర్చిస్తానని చెప్పారు.
బుధవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో చిత్రపురి సాధన సమితి సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. జూనియర్ ఆర్టిస్టులుగా, కాస్ట్యూమర్లుగా, ఫైటర్లుగా.. ఇలా సినిమా రంగంలో 24 క్రాఫ్టులలో పనిచేస్తున్న తమకు ఇళ్ళు దక్కడం లేదని,చిత్రపరిశ్రమకు సంభందం లేని వారికీ ప్లాట్స్ దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదేంటి అని ప్రశ్నిచింది వారికీ పనిలేకుండా చేస్తున్నారని బాధపడ్డారు.
శ్రీ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. హిందీ పరిశ్రమకు ముంబై కేంద్రం అయినట్టు మనతెలుగు భాషకు సంబంధించి ఏ యాసలో తీసినా హైదరాబాద్ కేంద్రం అవుతుంది. కాబట్టి హైదరాబాద్ చిత్రపురిలో తెలుగు సినిమా రంగంలోని వారి సొంత ఇంటి కల తీరాలి. ఒక పక్షి కూడా చిన్న గూడు కట్టుకునేందుకు తపిస్తుంది. అలాగే సినీ కార్మికులు కూడా తమ పిల్లలకు ఇల్లు ఇవ్వాలనుకుంటారు. చిత్రపురిలో ఇళ్లకు సంబంధించి మీకు భరోసాగా నిలుస్తాను. దీనిపై చిత్రపరిశ్రమలోని వారితో మాట్లాడతాను. పార్టీ పరంగా శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి మీకు అందుబటులో వుంటారు అని అన్నారు..
చిత్రపురిలో ఇళ్లు దక్కనివారికి భరోసాగా నిలుస్తా pic.twitter.com/zk0XloMuFb
— JanaSena Party (@JanaSenaParty) September 4, 2019
Credit: Twitter