Homeన్యూస్హరిహర వీర మల్లు షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టిన పవన్

హరిహర వీర మల్లు షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టిన పవన్

హరిహర వీర మల్లు షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టిన పవన్
హరిహర వీర మల్లు షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ నటించిన రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. దీంతో పవన్ కళ్యాణ్ మరో సినిమాను తిరిగి మొదలుపెట్టాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు షూటింగ్ ను ఈరోజు నుండి తిరిగి స్టార్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దాదాపుగా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈరోజు నుండి హైదరాబాద్ లో ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ను మొదట షూట్ చేస్తారట. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

అలాగే నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా ఏప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. హరిహర వీర మల్లుకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All