కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా మరణాలే. కరోనా పాజిటివ్ కేసులే.. చైనాలోని పుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పడు భూమిమీదున్న మనిషి మనుగడను ప్రశ్నార్థంగా మార్చేసింది. ఇంట్లో వుంటే ఫుడ్డు దొరకదు.. బయటికి వస్తే కరోనా బారిన పడక తప్పని పరిస్థితి. దీంతో జనం బయటికి రాలేక.. ఇంట్లో వుండలేక సతమతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర వెసులు బాటుని ప్రకటించి లాక్డౌన్ని సడలించడంతో జనం దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఇదిలా వుంటే తాజాగా పవన్స్టార్ పవన్కల్యాణ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఇంట్లో కరోనా కలకలం పలువురిని కలవరపెడుతోంది. ముంబైలోని బోనీ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా బోనీ కపూర్ వెల్లడించారు. తన ఇంట్లో పనిచేసే చరణ్ సాహో అనే వ్యక్తికి పరీక్షలు చేయిస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని, వెంటనే అతన్ని క్వారెంటైన్కి తరలించినట్టు వెల్లడించారు.
అయితే అతని కారణంగా తమ ఫ్యామిలీలో ఎవరికీ కరోనా సోకలేదని, పిల్లలు, పనివాళ్లు అంతా సేఫ్గా వున్నారని, ముందు జాగ్రత్త చర్యగా ఫ్యామిలీ అంతా క్వారెంటైన్లో వుంటున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ `వకీల్సాబ్` చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.