ప్రముఖ తమిళ హీరో, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్పై టాలీవుడ్ స్టార్ హీరో, జనసేనా అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా బారిన పడి మృతి చెందిన వారి ఖననానికి స్థలాన్ని ఇస్తానని ప్రకటించిన విజయ్కాంత్ గొప్ప మనసుకు పవన్కల్యాణ్ స్పందించారు. చెన్నైలో కరోనా కేసులు, మృతులు భారీగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన ఓ వైద్యుడు మృతి చెందాడు. అతడిని ఖననం చేయడానికి తీసుకెళ్లగా స్థానికులు అడ్డు చెప్పారు.
ఈ సందర్భంగా తమిళ హీరో విజయకాంత్ స్పందించి తన కాలేజీ స్థలాన్ని ఖననానికి వినియోగించాలని వెల్లడించారు. కరోనా బారిన పడి చనిపోయిన వారి ఖననానికి తన సొంత స్థలాన్ని కేటాయిస్తున్నానని ప్రకటన విడుదల చేశారు. తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కొంత స్థలాన్ని ఖననానికి కేటాయిస్తానని చెప్పడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనాతో మృతి చెందిన వారిని ఖననం చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందదని, ఈ విషయంలో ప్రజలకు ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా విజయ్కాంత్ కోరారు. ఈ విషయం తెలిసి విజయ్ కాంత్ని పవన్కల్యాణ్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.
An amazing and Noble gesture by Thiru @Vijayakant ,DMDK Leader and Superstar for offering a part of his college land for ‘Corona victims’ , where they have been denied burial in their own community burial grounds. https://t.co/TmQIuIXltL
— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2020
Credit: Twitter