కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా హీరోలు విలువైన సమయం వృథా అవుతోంది. ఈ ఖాళీ సమయంలో హీరోలు వరసగా కథలు వింటున్నారు. ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ప్రభాస్ నాలుగు ప్రాజెక్టులను సెట్ చేసిన విషయం తెల్సిందే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు.
ఈ ఏడాది వకీల్ సాబ్ ను విడుదల చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పటికే అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ ను చేయాల్సి ఉంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను కూడా ప్రకటించారు. మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఒకవైపు రాజకీయాలను మ్యానేజ్ చేస్తూ మరోవైపు సినిమా సినిమాకూ గెటప్ మార్పులను చూసుకుంటూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను పూర్తి చేయడం కత్తి మీద సామే. మరి మన పవర్ స్టార్ ఈ విషయాన్ని ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.