Homeటాప్ స్టోరీస్విజయవాడలో కేసీఆర్ కు థాంక్స్ చెపుతూ భారీ ప్లెక్సీ ఏర్పటు చేసిన పవన్ ఫ్యాన్స్ ..

విజయవాడలో కేసీఆర్ కు థాంక్స్ చెపుతూ భారీ ప్లెక్సీ ఏర్పటు చేసిన పవన్ ఫ్యాన్స్ ..

ఏపీ సర్కార్ ఫై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ నిన్న భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఏపీలో తప్ప మిగతా అన్ని చోట్ల బెనిఫిట్ షోస్ , అదనపు షోస్ పడ్డాయి. కానీ ఏపీలో మాత్రం వీటికి అనుమతించకపోవడం , టికెట్ ధరలను పెంచకపోవడం ఫై అభిమానులు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అభిమానులకు తోడు తెలుగు దేశం పార్టీ అధినేత దగ్గరి నుండి మిగతా నేతలు సైతం భీమ్లా నాయక్ కు సపోర్ట్ పలకడం , జగన్ సర్కార్ ఫై విమర్శలు చేయడం తో ఈ చిత్రానికి రాజకీయ రంగు అంటుకుంది. ఇదే అనుకుంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కేసీఆర్ పైన తమ అభిమానం చాటుకున్నారు. ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ ..కేసీఆర్ ఫొటోతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్‌ ఫోటోతో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోటోలు కూడా ఉన్నాయి. మరోవైపు ఫ్లెక్సీపై వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఫోటోలను కూడా పవన్ అభిమానులు ముద్రించారు. ప్రస్తుతం ఈ ప్లెక్సీ విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్‌గానే ఈ ఫ్లెక్సీ విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసినట్లుగా అంత భావిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All