భీమ్లా నాయక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..తాజాగా ప్రభాస్ డైరెక్టర్ సుజిత్ కు ఛాన్స్ ఇచ్చాడనే వార్త ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ – రానా కలయికలో సాగర్ కె చంద్ర డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు సైతం భారీగా రాబడుతుంది. ఈ మూవీ సక్సెస్ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటె తాజాగా పవన్ కళ్యాణ్ ..సాహో డైరెక్టర్ సుజిత్ కు సినిమా చేసే ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ తో చేసిన సాహో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. బాలీవుడ్ లో భారీ విజయం సాధించింది. సాహో తర్వాత కొన్ని కథలపై కసరత్తులు చేస్తున్న సుజిత్ దృష్టిలో ఓ తమిళ సినిమా రీమేక్ పడిందట. గతంలో విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘తెరి’ ఆధారంగా ఒక కథ రాసుకున్నాడట. ‘తెరి’ చిత్రాన్ని పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడట సుజిత్. పవన్ కళ్యాణ్ కి ఆ మార్పులు బాగా నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. మరి ఇది నిజమా కదా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ జానపద చిత్రంలో నటిస్తుండగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.