తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో చంద్రబాబు పై ఎటాక్ చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధించడంలో మీరు ఘోరంగా విఫలమయ్యారని , ఇన్నేళ్ల మీ అనుభవం , పాలనా దక్షత ఏమైందని నేరుగా చంద్రబాబు పై ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ కెక్కాడు పవన్ కళ్యాణ్. ఒకవైపు టిడిపి ఎంపీ లు బీజేపీ ని తప్పుపడుతూనే ప్రధాని మోడీ కాళ్ళు ఎలా మొక్కుతారని ఇదేం రాజనీతి అంటూ తెలుగుదేశం పార్టీని , ఆ నాయకుడు చంద్రబాబు నాయుడి పై దాడి చేస్తున్నాడు పవన్ . ఒకసారి హోదా కావాలని , మరోసారి స్పెషల్ స్టేటస్ తో ఎక్కువే సాధించామని అలాగే ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ కావాలని రకరకాలుగా డిమాండ్లు చేస్తూ మీరు ఎన్ని టర్న్ లు తీసుకున్నారో తెలుసా అంటూ చంద్రబాబు చేసిన రకరకాల ప్రకటన ల క్లిప్ లని పోస్ట్ చేసాడు పవన్ కళ్యాణ్.
అసలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి అంత సీన్ లేదని కనీసం ఒక్క సీటు ని కూడా గెల్చుకోలేని బీజేపీ తో అంటకాగింది మీరేనని , అలాంటి పార్టీ తో పొత్తు కోసం నేను వెంపర్లాడటం లేదని ఘాటుగా విమర్శించాడు పవన్ . 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పారీ బీజేపీ తో అలాగే పవన్ జనసేన తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ శత్రువు అయ్యాడు తెలుగుదేశం పార్టీకి . ఇక స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీకి నుండి దూరమయ్యాక తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు జగన్ , పవన్ , బీజేపీ లు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో చంద్రబాబు పై జగన్ , పవన్ లతో పాటుగా బీజేపీ వాళ్ళు మరింతగా ఎదురుదాడి చేస్తున్నారు.
English Title: pawan kalyan attack on tdp on no confidence motion