పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరో గా నటిస్తున్న చిత్రం `వకీల్ సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. హిందీ చిత్రం `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ రెండేళ్ల విరామం తరువాత చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ కూడా ఆ రేంజ్లో వుండటంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని పవన్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు.
కరోనా కారణంగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఆగస్టులో పెద్ద చిత్రాల షూటింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో `వకీల్ సాబ్` షూటింగ్ కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు పవన్ కల్యాణ్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వవం వహిస్తున్నారు. ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 19వ సెంచరీ నేపథ్యంలో మొగలుల కాలం నాటి కోహినూర్ వజ్రం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈచిత్రానికి `విరూపాక్ష` అనే టైటిల్ని కూడా చిత్ర బృందం ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. `వకీల్ సాబ్` షూటింగ్ పూర్తయితే గానీ క్రిష్ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించలేని పరిస్థితి. దీంతో ఈ చిత్ర రిలీజ్ వచ్చే ఏడాది సమ్మర్కు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుందని దర్శకుడు క్రిష్ కూడా అప్పుడే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే పరిస్థితులు మాత్రం ఈ సినిమా ఆగస్టుకు వెళ్లిపోయేలా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ టాక్.